NLG: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో భాగంగా జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా.. రహ్మత్ నగర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల అభీష్టం మేరకు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పాలన కొనసాగుతుందని పేర్కొన్నారు.