AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం బలపడింది. రాబోయే 24 గంటల్లో తుఫానుగా బలపడి.. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతానికి పోర్ట్ బ్లేయర్కు 610 KM, చెన్నైకి 790 KM, విశాఖకు 850 KM, కాకినాడకు 840 KMల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది.