TPT: తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఆదివారం పల్లంపేట ట్యాంకును పరిశీలించారు. భారీ వర్షాలు, తుఫాను నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేశారు. మండలానికి చెందిన అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ అధికారులు, మండల అధికారులు పాల్గొన్నారు.