KNR: అకాల వర్షాల నేపథ్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని బీఆర్ఎస్ రామడుగు మండల అధ్యక్షుడు గంట్ల జితేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రామడుగు మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.