KKD: జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా పిఠాపురం మండలం బి. కొత్తూరులో పిఠాపురం సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమతులు లేని 50 బైకులు, 1 వ్యాన్, 1 ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అనుమానిత వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.