MDK: చేగుంట మండలం వడియారం అటవీలో వల్లూరు గ్రామానికి చెందిన తల్లి కూతుర్లు యాదమ్మ (45), సంతోష (19)ల హత్యలకు పాల్పడిన నేరస్తుడు వడియారం గ్రామానికి చెందిన నగేష్ (49)కు జీవిత ఖైదు జైలు శిక్ష, రూ. 5 వేల జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి నీలిమ తీర్పునిచ్చినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. నేరస్థుడికి శిక్ష పడేందుకు కృషిచేసిన అధికారులను ఎస్పీ అభినందించారు.