BDK: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 32వ డివిజన్లో కార్పొరేటర్ రాంబాబు మంగళవారం పర్యటించారు. ముందుగా డివిజన్లో ప్రతి కుటుంబాలతో వ్యాపారస్తులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవభారత్ సెంటర్లోని డ్రైనేజ్ సమస్యలు, మంచినీటి సమస్యను త్వరలోనే పరిష్కార మార్గం చూపిస్తానని హామీ ఇచ్చారు.