SRCL: జిల్లాలో 2024 సంవత్సరంలో 3106 కేసులు నమోదయ్యాయని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం 2024 వార్షిక నివేదికను ఎస్పీ విడుదల చేశారు. ఎస్పీ అఖిల్ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులస్నేహపూర్వక విధానం, పోలీసుల పారదర్శక పనితీరు విధానం బాగుందన్నారు.