MDCL: తెలంగాణ జన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ సూచన మేరకు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఆధ్వర్యంలో అల్వాల్ చౌరస్తాలోని జయశంకర్ సార్ విగ్రహం వద్ద ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈనెల 29న నిర్వహించనున్న పార్టీ ప్లీనరీపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు భద్రగమ ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి ఏర్పుల దయాకర్, తదితరులు ఉన్నారు.