NZB: నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ పట్టణానికి జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు మంజూరైనట్లు న్యాయవాదులు చైతన్య, సురేశ్ తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పట్టణ ప్రజల కళ నెరవేరిందన్నారు. ఈ కోర్టుల ఏర్పాటుతో కక్షిదారుల కేసులు త్వరగా పరిష్కారం కానున్నాయి. హైకోర్టు నిర్ణయంపై భీంగల్ మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.