MDK: జిల్లా కేంద్రంలో ఈనెల 17న నిర్వహించే ప్రజా పాలన వేడుకలకు మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరుకానున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారని కలెక్టర్ అన్నారు. ఈ వేడుకలకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.