SDPT: నిరుపేదలకు ఇళ్లను అందించడమే కాంగ్రెస్ లక్ష్యమని సిద్దిపేట జిల్లా కార్యదర్శి చిక్కుడు అనిల్ కుమార్ అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పరిశీలించారు. పేద ప్రజలకు ఇళ్లను అందించడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరవుతాయన్నారు.