WNP: శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం మోజర్ల కళాశాలలో విద్యార్థులకు 7 రోజులపాటు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉద్యానవన ప్రొఫెసర్ బేబీ రాణి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. రసాయనాలు తగ్గించి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలని, రసాయనాలు వాడడం వల్ల వచ్చే నష్టాలను రైతులకు వివరించారు.