WGL: నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా ఉగాది పండుగను పురస్కరించుకొని వైన్ షాపులు, బెల్ట్ షాపుల యాజమాన్యాలు సిండికేట్గా ఏర్పడి మద్యం అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు మద్యం ప్రియులు ఆరోపించారు. ఎమ్మార్పీ ధర కంటే ₹30 నుంచి ₹50 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ఎక్సైజ్ అధికారులు స్పందించి అధిక ధరకు అమ్ముతున్న షాపులపై చర్యలు తీసుకోవాలని కోరారు.