JGL: కథలాపూర్ మండలం ఊటుపల్లి గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదివారం పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని ప్రజలు పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.