KMR: ముగ్గురు కూతుళ్లను నిర్దాక్షిణ్యంగా చెరువులోకి తోసి హత్య చేసిన తండ్రిని రిమాండ్ చేసినట్లు KMR సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. సబ్ డివిజన్ కార్యాలయంలో ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. అప్పుల భారం 3 కూతుళ్లను పోషించలేకనే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు అనుమానిస్తున్నామని తెలిపారు. నిందితుడిని కోర్టులో రిమాండ్ చేశామన్నారు.