MDK: రేగోడు మండలంలో పాఠశాల విద్యార్థిపై లైంగిక దాడికి పాల్పడిన అటెండర్ సారా జైపాల్ (25)కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ న్యాయమూర్తి సుబావల్లి తీర్పునిచ్చినట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. 2019లో జరిగిన సంఘటనలో నేరం రోజు కావడంతో కఠిన కారాగార శిక్ష విధించారన్నారు. అలాగే బాధితురాలికి రూ. లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశించినట్లు ఎస్పీ వివరించారు.