కామారెడ్డి: భిక్కనూరు ఎస్సై సాయికుమార్, కానిస్టేబుల్ శ్రుతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతి చెందడం బాధాకరమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. వారి కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకునేలా తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. జిల్లా ఆస్పత్రిలో గురువారం మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.