సూర్యాపేట ఆరో వార్డు గిరినగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం ఈరోజు నిర్వహించారు. కౌన్సిలర్ సునీల్ రెడ్డి, డాక్టర్ ప్రణీత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో జనరల్ ఆసుపత్రి నిపుణులు కంటి, దంత, స్త్రీ సంబంధిత సమస్యలకు పరీక్షలు చేశారు. రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేసి, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు.ఆసుపత్రి సిబ్బంది, ఏఎన్ఎంలు ఉన్నారు.