HNK: పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 21వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని కౌన్సిలర్ సూదమల్ల రమేష్ అన్నారు. వార్డు పరిధిలోని పలు కాలనీలలో నేడు కౌన్సిలర్ పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకొని శానిటేషన్ పనులను పరిశీలించారు. అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని కౌన్సిలర్ కోరారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు రమేష్, తదితరులు ఉన్నారు.