MDK: నిజాంపేట మండలం రాంపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీనాక్షి, డాక్టర్ మోహన్ నాయక్ ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వైద్య సేవలు అందించారు. గ్రామస్తుల ఆరోగ్య సమస్యలను తెలుసుకుని వారికి అవసరమైన మందులను పంపిణీ చేశారు. ఈ విధంగా ఇంటి వద్దకే వైద్యం అందించడం పట్ల గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ అధ్యక్షుడు రాజు, మాజీ సర్పంచ్ లక్ష్మణ్ పాల్గొన్నారు0