MNCL: విప్లవ యువ కిషోరాలు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ 95వ వర్ధంతి సభలను జిల్లా వ్యాప్తంగా జరపాలని పీడీఎస్యూ పట్టణ ప్రధాన కార్యదర్శి కె.కార్తిక్ పిలుపునిచ్చారు. ఆదివారం మంచిర్యాలలో వాల్ పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భగత్ సింగ్ సాహసం, తెగువ, త్యాగనిరతి, దేశభక్తి నేటి యువతకు స్ఫూర్తిదాయకమని తెలిపారు.