KMM: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఖమ్మంలో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో ఉదయం 11 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో.. పార్టీ మద్దతుతో ఉమ్మడి జిల్లాలో గెలిచిన సర్పంచ్లకు సన్మానిస్తారని వివరాలను మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.