JGL: ఎరువులను MRP కంటే ఎక్కువ ధరకు అమ్మినట్లయితే అట్టి డీలర్లపైన కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని జగిత్యాల జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ హెచ్చరించారు. శుక్రవారం జగిత్యాల అర్బన్ మండలంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు చేసి, ఎరువుల స్టాకు రిజిస్టర్లు, e-PASSలో ఉన్న స్టాక్ వివరాలు, గోదాములలో ఉన్న ఎరువుల నిల్వలను తనిఖీ చేశారు.