SRPT: ఐక్యరాజ్యసమితి కార్యకలాపాలపై సూర్యాపేటలో నిర్వహించిన ‘తెలంగాణ మోడల్ యునైటెడ్ నేషన్స్’ పోటీల్లో పీఎం శ్రీ ఉన్నత పాఠశాల విద్యార్థి గంట సాత్విక్ ప్రతిభ చాటారు. జర్మనీ పర్యావరణ సమస్యలపై ప్రసంగించి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ చేతుల మీదుగా సాత్విక్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని పలువురు అభినందించారు.