MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామ ఎంపీటీసీ క్లస్టర్ ముఖ్య నాయకుల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు మాట్లాడుతూ.. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను ఆరు గ్యారెంటీల అమలుపై నిలదీయాలని అన్నారు.