MLG: వెంకటాపురం మండలం నుండి వాజేడు వరకు ఉన్న ప్రధాన రహదారి పై భారీ గుంతలు ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఒంటిమామిడి, చిరుతపల్లి, ప్రగళ్లపల్లి వద్ద భారీ గుంతలు వాహనదారులకు ప్రమాదకరంగా మారాయి. ఇప్పటికైనా ఈ సమస్య పై అధికారులు స్పందించి తక్షణమే రోడ్డు మరమత్తు పనులు చేపట్టాలని వాహనదారులు ఇవాళ కోరారు.