SRCL: సిరిసిల్ల పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్, మాజీ మంత్రి సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం సాయంత్రం రథోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించగా కేటీఆర్ హాజరై పూజలు నిర్వహించారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.