WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ. 6,860 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ.15,100 ధర పలకగా… వండర్ హాట్(WH) మిర్చి రూ. 16,500 పలికింది. తేజ మిర్చి ధర రూ.14,550 కి చేరింది. మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతుంది.