ADB: క్రీడల్లో గెలుపోటములు సహజమని మాజీ మున్సిపల్ ఛైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని భగత్ సింగ్ నగర్ లో ఇవాళ నిర్వహించిన క్రికెట్ ముగింపు పోటీల్లో ఆయన పాల్గొని గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. క్రీడలతో స్నేహపూర్వక సంబంధాలు పెంపొందుతాయన్నారు. యువకులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని కోరారు.