MBNR: పాలమూరు ప్రజలను అమాయకులుగా భావించవద్దని హరీశ్రావుపై ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జూరాల, కల్వకుర్తి ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలోనే కట్టారని గుర్తు చేస్తూ, జిల్లా వెనుకబాటుకు గత BRS ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు జిల్లా అభివృద్ధిని విస్మరించి, ఇప్పుడు విమర్శలు చేయడం హాస్యాస్పదమని పేర్కొన్నారు.