HYD: షేక్పేట డివిజన్లో పరిధిలో గురువారం స్థానిక కార్పొరేటర్ మహమ్మద్ రషీద్ అధికారులతో కలిసి పర్యటించారు. డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీలో కొనసాగుతున్న రోడ్డు పనులను కార్పొరేటర్ పరిశీలించారు. రూ.1.9 కోట్లతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. సకాలంలో పనులు పూర్తి చేయాలని, నాణ్యతలో రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు.