NLG: తిరుమలగిరి మండలంలో ఫోటోగ్రాఫర్ మధుపై మద్యం మత్తులో దాడి చేసి, కెమెరాలు ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ చిట్యాల మండల ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ అధ్యక్షుడు సైదులు యాదవ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వృత్తిధర్మంలో ఉన్నవారిపై ఇలాంటి దాడులు అమానుషమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చిట్యాల పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు.