MNCL: బెల్లంపల్లి బస్తీలోని శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి హాజరుకావాలని మంత్రి వివేక్ వెంకటస్వామిని నిర్వాహకులు కోరారు. ఆదివారం మంత్రిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి, విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకకు తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చారని నిర్వాహకులు తెలిపారు.