MNCL: జిల్లాలో జాతీయ రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని RDO కార్యాలయంలో రహదారి విస్తరణ ఆర్బిట్రేషన్ సంబంధిత రికార్డులను పరిశీలించారు. రహదారి విస్తరణలో భాగంగా ప్రభావిత గ్రామాలలో అవార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. ఆర్బిట్రేషన్ రికార్డులను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలన్నారు.