MNCL: బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని కార్మిక సంఘాల JAC నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్కు వినతిపత్రం అందజేశారు. రిటైర్డ్ కార్మికులు మందుల కోసం వెళితే బీజోన్ ఆసుపత్రికి రిఫర్ చేయడం అనివార్యం అయిపోయిందన్నారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన వైద్యం అందడం లేదన్నారు.