KNR: సెప్టెంబర్ 13న జరగనున్న జాతీయ లోక్ అదాలతను రాజీపడదగిన కేసుల పరిష్కారానికి ఉపయోగించుకోవాలని కేశవపట్నం ఎస్సై శేఖర్ సూచించారు. ఇరుపక్షాల మధ్య చట్టబద్ధంగా వివాదాలను పరిష్కరించడం లోక్ అదాలత్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఫిర్యాది, ముద్దాయి ఇద్దరూ ఇష్టపూర్వకంగా రాజీపడే అవకాశాన్ని వినియోగించుకుంటే సమయంతో పాటు న్యాయ వ్యయాన్ని కూడా తగ్గించవచ్చని తెలిపారు.