WGL: నగరంలోని లేబర్ కాలనీకి చెందిన కల్పవల్లి ఫైనాన్స్ యజమాని వెంకటేశ్వర్లు చీటీలు నిర్వహిస్తూ వందలాది మందినుంచి డబ్బులు వసూలు చేసి చెల్లించకుండా పరారైయ్యాడు. దీంతో బాధితుడు పోరండ్ల సునీల్ ఫిర్యాదు మేరకు 2022 మే 2న పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం కేసు విచారణకు రాగా, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీ. బీ నిర్మలా గీతాంబ ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.17వేల జరిమానా విధించారు.