NRML: నిర్మల్ పట్టణానికి నీటి సరఫరా చేసే మిషన్ భగీరథ మాడెగాం శుద్ధీకరణ కేంద్రంలో నిర్వహణ, మరమ్మతు పనులు జరుగనున్నందున మార్చి 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు పురపాలక సంఘం అధికారులు తెలిపారు. ప్రజలు ముందస్తుగా నీటిని నిల్వ చేసుకోవాలని గురువారం సూచించారు.