JGL: శ్రీరామనవమిని పురస్కరించుకొని భద్రాద్రిలో జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవ పవిత్ర తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేరవేసేందుకు TGSRTC సిద్ధమైంది. భక్తులు రూ.151చెల్లించి టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని, కల్యాణం అనంతరం ఈ పవిత్ర తలంబ్రాలను భక్తుల చిరునామాకు డెలివరీ చేస్తామని జగిత్యాల డిపో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ తెలిపారు.