ఆదిలాబాద్: ఖానాపూర్ కోర్టు ఏజీపీగా నియమితులైన ఆసీఫ్ అలీని అంబేద్కర్ సంఘం ఖానాపూర్ నాయకులు సన్మానించారు. మంగళవారం వారు ఖానాపూర్ పట్టణంలో ఏజీపీ ఆసీఫ్ అలీని శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మేస సతీష్, సీనియర్ నాయకులు రేవతి రాజేశ్వర్ నేత, శ్యామ్, జన్నారపు శంకర్, గొర్రె గంగాధర్, రసమల శేఖర్, ప్రణీత్, రాజేశ్వర్, ఎం.సురేష్, దామోదర్ ఉన్నారు.