MBNR: జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటనపై ఎంపీ డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా వైద్యశాఖ మంత్రి ఉన్న చోటే పరిస్థితి ఇలా ఉంటే ఇతర జిల్లాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ ఘటనతో ప్రభుత్వ చిత్తశుద్ధి బయటపడిందని విమర్శించారు.