WGL: రాయపర్తి మండలం వేంకటేశ్వరపల్లిలో స్వయం వక్త శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ శివారులో గుప్తనిధుల కోసం గుర్తుతెలియని దుండగులు శుక్రవారం తవ్వకాలు చేపట్టారు. ప్రధాన ఆలయానికి కూతవేటు దూరంలో ఉన్న పురాతన శివాలయం శివారులో సుమారు 8 అడుగుల లోతు మట్టిని తవ్వారు. స్థానికులు విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారం చేరవేశారు.