HYD: కంటోన్మెంట్ 8వ వార్డు రీసాల బజార్, శాంతినగర్ కాలనీలో మంగళవారం రోడ్డు పనులను కంటోన్మెంట్ బోర్డ్ మెంబర్, బీజేపీ నేత రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంటోన్మెంట్లో జరిగే ప్రతీ అభివృద్ధి పని వెనక బీజేపీ నాయకులు, కార్యకర్తల కష్టం ఉందన్నారు. వారు నిరంతరం ప్రజల మధ్యలో ఉండి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.