SDPT: ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాజకీయ పార్టీలు సహకరించాలని రాజగోపాల్పేట ఎస్సై వివేక్ తెలిపారు. కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం నంగునూరులో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో నిలిచే అభ్యర్థుల అర్హత, ఖర్చులు, నిబంధనలపై అవగాహన కల్పించారు. ఎంపీడీవో వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.