ADB: ఉట్నూర్ మండలంలోని చిన్నుగూడకు చెందిన శనివారం రాత్రి చౌకటి శ్రీకాంతాబాయికి పురిటి నొప్పులు రావడంతో 108కి సమాచారం అందించారు. ఈ మేరకు ఆమెను రిమ్స్ ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యంలోనే బిడ్డకు జన్మనిచ్చినట్లు ఈఎంటీ (EMT) దత్తాత్రేయ, పైలట్ రవీందర్ తెలిపారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తల్లి, బిడ్డను 108 వాహనంలో రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.