ఆసియా కప్ లీగ్ మ్యాచ్ల్లో భారత్ దుమ్మురేపుతోంది. లంకతో జరిగిన మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. బ్యాట్స్మెన్ అంతగా రాణించకున్నప్పటికీ.. బౌలర్లు సత్తా చాటారు.
శ్రీలంకపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ 48 బంతుల్లో 53 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. భారత కెప్టెన్ తన పేరిట కొత్త రికార్డును సృష్టించాడు.
పాకిస్థాన్తో జరిగిన సూపర్-4 మ్యాచ్లో భారత జట్టు ఏకపక్షంగా 228 పరుగుల విజయాన్ని నమోదు చేసి అతి ముఖ్యమైన 2 పాయింట్లను కూడా సాధించింది. ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాట్స్మెన్ తర్వాత బౌలర్ల నుంచి కూడా అద్భుత ప్రదర్శన కనిపించింది.
ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికైన విరాట్ కోహ్లీ కేక్ కట్ చేశాడు. దీని తర్వాత, శ్రీలంకతో మ్యాచ్కు ముందు ఆటగాళ్లందరూ రికవరీ సెషన్ కోసం స్విమ్మింగ్ పూల్లో గడిపారు.
పాక్ కెప్టెన్ బాబర్ అజామ్కు ఇంతకుముందు ఏప్రిల్ 2021, మార్చి 2022లో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ టైటిల్ లభించింది. ఈ అవార్డును గెలుచుకున్న తర్వాత సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
శ్రీలంకపై 22వ పరుగు చేసి రోహిత్ శర్మ ఈ ప్రత్యేక మైలురాయిని సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 10 వేల పరుగులు చేసిన మూడో వ్యక్తిగా రోహిత్ శర్మ నిలిచాడు.
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ను 2.8 కోట్ల మంది ప్రత్యక్షంగా వీక్షించారని ఆయన ఈ ట్వీట్లో రాశారు. ఇది కాకుండా, జై షా తన ట్వీట్లో డిస్నీ ప్లస్ హాట్స్టార్ను పేర్కొన్నారు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్ పేరిట ఉంది.
కొలంబో వేదికగా జరగనున్న మ్యాచ్కు ఈ రోజు వర్షం ముప్పు తప్పేలా లేదుని వాతావరణ శాఖ తెలిపింది. భారత్, శ్రీలంక ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం కానుంది. మరి వర్షం వస్తే ఏం జరుగుతుంది అని అందరిలో ఆసక్తి నెలకొంది.
ఆసియా కప్ 2023 టోర్నీలో భాగంగా నేడు భారత్, పాక్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ విరుచుకుపడుతోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేశారు.
అంతర్జాతీయ క్రికెట్లో ఓపెనర్గా అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా వార్నర్ నిలిచాడు. ఆఫ్రికాతో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో వార్నర్ బ్యాట్తో 93 బంతుల్లో 106 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.
అంతర్జాతీయ క్రికెట్లో ఓపెనర్గా భారత్ తరఫున రోహిత్ 300 మ్యాచ్లు పూర్తి చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్కు సంబంధించిన ప్రత్యేక జాబితాలో చోటు దక్కించుకున్నాడు. భారత్ తరఫున ఓపెనర్గా అత్యధిక మ్యాచ్లు ఆడిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది.
ఈరోజు పాకిస్థాన్పై విరాట్ కోహ్లీ 98 పరుగులు చేస్తే వన్డే కెరీర్లో 13000 పరుగులు పూర్తి చేస్తాడు.. అలా చేయడంలో విజయం సాధిస్తే అత్యంత వేగంగా 13000 పరుగులు చేసిన ఆటగాడు అవుతాడు.