»India Pakistan Match Pink Color Seen During India Pakistan Match Navrasa Theme Of The World Cup Special
IND VS PAK: ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్లో పింక్ కలర్ బోర్డులు.. అది దేనికి సింబల్ అంటే ?
ప్రస్తుతం నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ ప్రపంచకప్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్ల అద్భుతమైన ఆటతీరు పట్ల క్రికెట్ ప్రియులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
IND VS PAK: ప్రస్తుతం నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ ప్రపంచకప్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్ల అద్భుతమైన ఆటతీరు పట్ల క్రికెట్ ప్రియులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ సందర్భంగా స్టేడియంలో అనేక పింక్ పోస్టర్లు అందని దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ పింక్ కలర్తో ఇండియా పాకిస్థాన్ మ్యాచ్కి సంబంధం ఏంటని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. దీని వెనుక ఉన్న ప్రత్యేక కారణాన్ని తెలుసుకుందాం.
పింక్ కలర్ తో నిండిన నరేంద్ర మోడీ స్టేడియం
లక్ష మందికి పైగా జనంతో నిండిన అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం ప్రస్తుతం రెండు రంగులలో కనిపిస్తుంది. మొదటి రంగు నీలం, ఇది భారత క్రికెట్ జట్టు జెర్సీ రంగు. ఇతర రంగు పింక్, ఇది ప్రతిచోటా కనిపిస్తుంది. ఈ పింక్ కలర్కి ఈ మ్యాచ్కి.. వరల్డ్కప్కి సంబంధం ఏంటి అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఈసారి ఐసిసి ప్రపంచకప్ లోగోలో పింక్ కలర్ని ఉపయోగించించారు. అంపైర్ రంగు, స్టంప్స్, టీవీలో నడుస్తున్న స్కోర్ బోర్డు కూడా గులాబీ రంగులో ఉండటానికి కారణం ఇదే.
పింక్ కలర్తో నవరాస్కు సంబంధం
ఈసారి నవరాస్ థీమ్తో ప్రపంచకప్ లోగోను ఐసీసీ రూపొందించింది. నవరస అనేది భారతీయ సంస్కృతి ఒక రూపం. దీనిలో తొమ్మిది రంగులు ఉన్నాయి. ప్రతి రంగు ఒక భావోద్వేగాన్ని సూచిస్తుంది. ఈ నవరసాలలో గులాబీ రంగుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అందుకే ఈసారి ప్రపంచకప్ 2023లో మీరు ఎక్కడ చూసినా పింక్ కలర్నే చూస్తున్నారు. ఐసిసి తన అధికారిక వెబ్సైట్లో విడుదల చేసిన వీడియోలో ఈ విషయం వివరించబడింది. వీడియోలో భారతీయ సంస్కృతి, పండుగలకు సంబంధించిన ప్రతి కోణాన్ని చూడవచ్చు.