వాంఖడే మైదానం వేదికగా లక్నోతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై భారీ స్కోర్ చేసింది. రికెల్టన్ (58), సూర్యకుమార్ యాదవ్ (50) హాఫ్ సెంచరీలతో రాణించారు. విల్ జాక్స్ (29), బాష్ (20), నమన్ ధీర్ (25*) పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్, ఆవేశ్ ఖాన్ తలో రెండు వికెట్లు తీశారు.