సౌతాఫ్రికాతో తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో భారత్ ఒక్క రన్కే 2 వికెట్లు కోల్పోయింది. యాన్సెన్ బౌలింగ్ ధాటికి జైస్వాల్ డకౌట్ కాగా.. రాహుల్ ఒక్క రన్ చేసి పెవిలియన్ చేరాడు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ స్కోర్ 10/2. ప్రస్తుతం క్రీజులో సుందర్(4), జురెల్(5) ఉన్నారు. విజయానికి మరో 114 రన్స్ కావాలి. కాగా ఈడెన్ గార్డెన్స్లో విజయవంతమైన ఛేజ్ 117 మాత్రమే.